హైదరాబాద్ : రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. శనివారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించామని పేర్కొన్నారు. జనతా కర్ఫ్యూలో స్వచ్ఛంగా పాల్గోనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఐటి కంపెనీలకు, మతపెద్దలకు, ట్రాన్స్ పోర్టు వ్యాపారులకు తగుసూచనలు ఇచ్చామని వెల్లడించారు. రేపు(ఆదివారం) పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందని, కరోనా తీవ్ర స్థాయికి చేరకుండా ఉండాలంటే జనతా కర్ఫ్యూను అందరం పాటించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ చేశామని, ఇమిగ్రేషన్ సమాచారంతో గుర్తించిన 1300 మంది క్వారంటైన్లోనే ఉన్నారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. (విదేశీ ప్రయాణ చరిత్ర లేని మహిళకు కరోనా..)
‘జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యం కావాలి’